
మెహిదీపట్నం, వెలుగు: ఇంటి నిర్మాణం విషయంలో ఎన్నారైను బెదిరించిన ఓ ఫేక్ న్యూస్ రిపోర్టర్ పై ఆసిఫ్నగర్ పోలీసులు కేసు ఫైల్చేశారు. ఇరాదుల్లా ఖాన్(53) అనే ఎన్నారై ఆసిఫ్ నగర్ పీఎస్ పరిధి ఆలపాటి నగర్లో మూడంతస్తుల బిల్డింగ్నిర్మిస్తున్నాడు. అది గుర్తించిన మహ్మద్యూనస్అనే వ్యక్తి ఇరాదుల్లాఖాన్ను కలిశాడు.
న్యూస్రిపోర్టర్ని అని పరిచయం చేసుకున్నాడు. తనకు రూ.15 లక్షలు ఇవ్వకపోతే అక్రమ నిర్మాణం పేరుతో జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేస్తానని, నిర్మాణ పనులు ఆగిపోతాయని బెదిరించాడు. యూనస్ అస్సలు న్యూస్రిపోర్టరే కాదని తెలుసుకున్న ఇరాదుల్లా ఖాన్ఆసిఫ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్వెంకటేశ్వర్లు తెలిపారు.