
భద్రాచలం, వెలుగు : రూ.2.50కోట్లతో భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి బుధవారం ఏఎస్పీ పంకజ్పరితోష్ శంకుస్థాపన చేశారు. దేశంలోనే అత్యంత మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో భద్రాద్రికొత్తగూడెం మొదటి స్థానంలో ఉంది.
ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ భవనాలను పటిష్ట పరిచేందుకు కేంద్ర హోంశాఖ ఎల్డబ్ల్యూఈ స్కీం కింద నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో ఏడాదిలోపే కొత్త టౌన్పోలీస్ స్టేషన్భవన నిర్మాణం పూర్తి చేస్తామని ఏఎస్పీ పంకజ్పరితోష్ తెలిపారు. కార్యక్రమంలో సీఐ నాగరాజురెడ్డి, ఎస్సైలు మధుప్రసాద్, పీవీఎన్రావు, విజయలక్ష్మి, పోలీస్ హౌసింగ్బోర్డు డీఈ రాందాసు, కాంట్రాక్టర్ మాలకొండయ్య పాల్గొన్నారు.