
బాన్సువాడ రూరల్, వెలుగు :విద్యార్థులు టీవీ, పోన్లకు దూరంగా ఉండాలని ఏఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ మొహరిల్ శ్రీనివాస్రావు అన్నారు. ఆదివారం బాన్సువాడ పట్టణంలోని సాయికీర్తి జూనియర్ కళాశాలలో టీజీ సెట్ మోడల్ టెస్ట్ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టూడెంట్లు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
రాష్ట్ర ప్రస్తుతం గురుకులాల్లో ఉచిత విద్యను అందిస్తుందని, వాటిని వినియోగించుకోవాల్నారు. అనంతరం మోడల్ టెస్ట్ లో ప్రతిభ కనబరిచిన స్టూడెంట్లకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఏఎస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థపాకులు అయ్యాల సంతోశ్, ఫౌండేషన్ సభ్యులు కల్లూరి రాజారాం, రోటె సాయిలు, పర్వయ్య, నాగరాజు, మన్నె సాయిలు తదితరులు పాల్గొన్నారు.