MLA ల ఫిరాయింపు కేసు: అసెంబ్లీ కార్యదర్శి కౌంటర్​ దాఖలు

MLA ల ఫిరాయింపు కేసు: అసెంబ్లీ కార్యదర్శి కౌంటర్​ దాఖలు

పార్టీ మారిన MLAలపై బీఆర్​ఎస్​ దాఖలు చేసిన పిటిషన్​ ఈ రోజు ( మార్చి25) సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.  ఈ క్రమంలో అసెంబ్లీ కార్యదర్శి కౌంటర్​ అఫిడవిట్​ దాఖలు చేశారు.  అనర్హత పిటిషన్ల వ్యవహారంలో స్పీకర్​ చట్ట ప్రకారమే వ్యవహరిస్తున్నారని అసెంబ్లీ కార్యదర్శి  కౌంటర్​ లో పేర్కొన్నారు.   తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ సకాలంలో నిర్ణయం తీసుకోలేదన్న వాదన సరైంది కాదని, అనర్హత పిటిషన్లపై చట్టంలో పేర్కొన్న పద్ధతిని ఆయన అనుసరిస్తున్నారని శాసనసభ కార్యదర్శి సుప్రీంకోర్టుకు నివేదించారు. 

స్పీకర్​ నిర్ణయం తీసుకునేవారకు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవద్దని.. ఈ విషయంలో అనేక తీర్పులున్నాయని అసెంబ్లీ కార్యదర్శి తెలిపారు. అనర్హత కేసులో చట్ట ప్రకారం స్పీకర్​ వ్యవహరిస్తున్నప్పటికి..  పిటిషనర్లే దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారు.  పార్టీ  మారిన ఎమ్మెల్యేలు స్పీకర్‌ను ఆశ్రయించిన వెంటనే బీఆర్​ఎస్​ నేతలు  కోర్టుకెక్కారని.. కాబట్టి  వారి స్పెషల్‌ లీవ్‌ పిటిషన్లను కొట్టేయాలని తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి కౌంటర్​ దాఖలు చేశారు.