
వరుసగా మూడు సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు బీఆర్ఎస్ఎమ్మెల్యే హరీశ్ రావు కృతఙ్ఞతలు తెలిపారు.గతంలో ఫార్మాసిటీని వ్యతిరేకించిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఫ్యూచర్ సిటీ పేరుతో ప్రభుత్వం భూములు లాక్కుంటుందని హరీశ్ రావు అసెంబ్లీలో అన్నారు. ఇక రైతు రుణ మాఫీ గురించి మాట్లాడిన హరీశ్.. సగం మందికి కూడా రుణ మాఫీ జరగలేదని విమర్శించారు. రైతుభరోసా కూడా ఇంకా అందరికి అందలేదన్నారు.
భట్టి బడ్జెట్ వాస్తవికతలకు దూరంగా ఉందన్నారు. కౌలు రైతులకు సాయం ఎక్కడ చేశారో చెప్పాలని ప్రశ్నించారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఎక్కడ అంటూ ప్రశ్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్.. ఏడాది కాలంలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదన్నారు. గత బడ్జెట్ కేటాయింపులను పోల్చుతూ మాజీ మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో ప్రసంగించారు.ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన కాంగ్రెస్.. తరువాత అమలు చేయడం లేదన్నారు. నిరుద్యోగ భృతి.. ఏడాదికి లక్ష ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు.