
రిక్రూట్మెంట్లో భాగంగా మొదట ఐడీబీఐ... మణిపాల్ (బెంగళూరు), నిట్టే (గ్రేటర్ నోయిడా) విద్యా సంస్థలతో కలిసి ఏడాది(9 నెలలు క్లాస్ రూం+3 నెలలు ఇంటర్న్షిప్) వ్యవధి గల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్(పీజీడీబీఎఫ్)లో ట్రైనింగ్ ఇస్తారు. విజయవంతంగా పూర్తిచేసిన వారికి అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగంలో జాయిన్ అవుతారు.
మొత్తం ఖాళీలు: 650
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
వయసు: 2021 జూలై 01 నాటికి 21 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు; పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
సెలెక్షన్ ప్రాసెస్: ఆన్లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక.
ఎగ్జామ్ ప్యాటర్న్: పరీక్ష మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. 200 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. సమాధానాన్ని తప్పుగా గుర్తిస్తే 0.25 చొప్పున మార్కు తీసివేస్తారు.
ట్రైనింగ్ ఫీజు: ఎంపికైన అభ్యర్థులను ఏడాది పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సులో చేరుస్తారు. అభ్యర్థులు కోర్సు ఫీజు కింద రూ.3,50,000 చెల్లించాలి. కోర్సులో చేరేటప్పుడు మూడేళ్లు సర్వీస్ బాండ్ సమర్పించాలి.
దరఖాస్తులు: ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
చివరి తేదీ: 22 ఆగస్టు
ఎగ్జామ్: 4 సెప్టెంబర్
తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జామ్ సెంటర్స్: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం
వెబ్సైట్: www.idbibank.in