
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన డైరెక్ట్/ లేటరల్ ఎంట్రీలో 255 అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ కోరుతోంది.
అర్హత: సంబంధిత విభాగంలో మెడికల్ పీజీ (ఎండీ, ఎంఎస్, డీఎన్బీ, డీఎం) ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 42 సంవత్సరాలు మించకూడదు.
స్పెషాలిటీ: అనస్థీషియా, డెర్మటాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, ఈఎన్టీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, న్యూక్లియర్ మెడిసిన్, ఓబీజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, సైకియాట్రీ, రేడియో డయాగ్నోసిస్, రేడియోథెరపీ, టీబీ అండ్ సీడీ, ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్, ఆఫ్తల్మాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, పాథాలజీ, ఎస్పీఎం.
సెలెక్షన్: అకడమిక్లో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో ఫిబ్రవరి 15 వరకు దరఖాస్తు చేసుకోవాలి. రూ.1000(బీసీ, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ.500) అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
పూర్తి వివరాలకు www.dme.ap.nic.in వెబ్సైట్లో సంప్రదించాలి.