ఎంఎఫ్‌లపై అవగాహనకు 3 కార్యక్రమాలు

ఎంఎఫ్‌లపై అవగాహనకు 3 కార్యక్రమాలు
  • ప్రారంభించిన యాంఫీ

న్యూఢిల్లీ: మ్యూచువల్​ ఫండ్స్​(ఎంఎఫ్​) గురించి అవగాహన కల్పించడానికి, పెట్టుబడులను పెంచడానికి అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) మూడు కార్యక్రమాలను ప్రారంభించింది. యంగ్​ఇన్వెస్టర్లను ఎంకరేజ్​ చేయడానికి తరుణ్ ​యోజన, మరచిపోయిన ఎంఎఫ్​లను ట్రాక్​ చేయడానికి మిత్రను మొదలు పెట్టింది. ఇదిగాక ఎంఎఫ్​ఇన్వెస్ట్​మెంట్లను పెంచడానికి యాంఫీ, సెబీ కలసి మరో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. 

తక్కువ ఆదాయం గల వాళ్లు, ఫస్ట్​టైం ఇన్వెస్టర్లు కూడా ఎంఎఫ్​లలో ఇన్వెస్ట్​ చేయడానికి నెలకు రూ.250తో  సిస్టమాటిక్ ​ఇన్వెస్ట్​మెంట్​ప్లాన్​(సిప్​)ను సెబీ రూపొందించాయి. తరుణ్​ యోజన ద్వారా స్కూళ్లలో స్టూడెంట్లకూ ఎంఎఫ్‌ల గురించి అవగాహన కల్పిస్తారు. ఎంఎఫ్‌లలో పెట్టి మర్చిపోయిన డబ్బును తిరిగి తీసుకోవడానికి ఎంఎఫ్​ ట్రేసింగ్​అండ్​ రిట్రీవల్​ అసిస్టెంట్​(మిత్ర) ఉపయోగపడుతుంది. మనదేశంలో ఎంఎఫ్ ​పరిశ్రమ దూసుకెళ్తోంది. అసెట్ ​అండర్​ మేనేజ్​మెంట్​(ఏయూఎం) విలువ రూ.65 లక్షల కోట్లు దాటిందని యాంఫీ వర్గాలు తెలిపాయి.