గ్రామాల అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే జారే ఆదినారాయణ 

గ్రామాల అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే జారే ఆదినారాయణ 

చండ్రుగొండ, వెలుగు : పార్టీలకతీతంగా గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నానని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తెలిపారు. శనివారం పలు గ్రామాల్లో రూ.2.15 కోట్ల అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేరళ రాష్ట్ర పర్యటనలో అక్కడ చూసిన అంగన్ వాడీ సెంటర్ల భవనాల డిజైన్ తో ఇక్కడ నిర్మించనున్నట్లు తెలిపారు. వెనకబడిన ప్రాంతాల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు. రెండు నెలలో అభివృద్ధి పనులను నాణ్యతతో స్పీడప్ చేయాలని ఆఫీసర్ల ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పీఆర్ డీఈ సైదురెడ్డి, ఏఈ శ్రీనివాసరావు, ఎంపీడీవో అశోక్, తహసీల్దారు సంధ్యారాణి, నాయకులు కృష్ణారెడ్డి, భోజ్యానాయక్, రమణ, సురేశ్, ఏడుకొండలు, గోవిందరెడ్డి, రామారావు తదితరులు  పాల్గొన్నారు.