
- ఇండియాలోని టాప్–5 ఆటో కంపెనీల మొత్తం వాల్యూ కంటే ఎక్కువ
న్యూఢిల్లీ: చైనీస్ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ బీవైడీ షేర్లు ఈ ఏడాది ఏకంగా 40 శాతం పెరగడంతో దీని మార్కెట్క్యాప్ 165.7 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.14.37 లక్షల కోట్లకు) దూసుకెళ్లింది. ఇది మనదేశంలోని టాప్–5 ఆటోమొబైల్ కంపెనీల ఉమ్మడి విలువ కంటే ఎక్కువ! ఈవీలను ఐదు నిమిషాల్లో చార్జ్ చేసే టెక్నాలజీని అభివృద్ధి చేయడంతో బీవైడీపై ఇన్వెస్టర్లు బుల్లిష్గా ఉన్నారు. మనదేశంలోని ఐదు అతిపెద్ద ఆటో కంపెనీల మొత్తం మార్కెట్ విలువ 151.52 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.13.10 లక్షల కోట్లు) ఉంది.
మారుతి సుజుకి మార్కెట్ విలువ 42.36 బిలియన్ డాలర్లు కాగా, మహీంద్రా అండ్ మహీంద్రా విలువ 39.12 బిలియన్ డాలర్లు . టాటా మోటార్స్ 29.02 బిలియన్ డాలర్ల మార్కెట్క్యాప్తో మూడోస్థానంలో ఉంది. బజాజ్ ఆటో, ఐషర్ మోటార్స్కు వరుసగా 24.87 బిలియన్ డాలర్లు, 16.15 బిలియన్ డాలర్ల మార్కెట్క్యాప్ ఉంది.