
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ ఐపీఓ ఈ నెల 28–30 తేదీల్లో ఉంటుంది. ఇది ఫ్రెష్ ఇష్యూ ద్వారా రూ.927 కోట్లు, మిగతావి ఓఎఫ్ఎస్ద్వారా సేకరించనుంది. ఐపీఓ సైజు రూ. 2,626 కోట్లు. ధర వివరాలను బుధవారం ప్రకటించే అవకాశం ఉంది. కంపెనీ రూ. 9,900–రూ.10 వేల కోట్ల ప్రీ-మనీ వాల్యుయేషన్ను లక్ష్యంగా పెట్టుకుంది. పోస్ట్-మనీ వాల్యుయేషన్ రూ. 12వేల కోట్లు దాటుతుందని అంచనా.