
న్యూఢిల్లీ: మాజీ సీఎం, ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్) నేత అతిశీ ఢిల్లీ శాసనసభలో ప్రతిపక్ష నాయకురాలిగా ఎన్నికయ్యారు. ఆప్నుంచి గెలిచిన 22 మంది ఎమ్మెల్యేలు ఆదివారం సమావేశమయ్యారు. కల్కాజీ స్థానం నుంచి ఎన్నికైన ఆతిశీ పేరును లీడర్ఆఫ్అపోజిషన్(ఎల్ఓపీ)గా ఎమ్మెల్యే సంజీవ్ఝా ప్రతిపాదించగా ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో ఢిల్లీ శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఎన్నికైన తొలి మహిళ ఆతిశీ కావడం గమనార్హం. ఈ సమావేశంలో పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు.