
- మాలమహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాప్రతిధుల ఇళ్లపై దాడి చేసిన వారిపై అట్రాసిటీ కేసులు పెట్టాలన్నారు మాలమహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరుపెట్టడంతో ఓర్వలేక దాడులు చేస్తున్నారని ఆయన విమర్శించారు. పేరు నచ్చకపోతే నిరసన తెలపడం, ప్రభుత్వానికి వినతి పత్రం ఇవ్వడం చేయాలి అంతేగాని దాడులకు దిగడం సరికాదన్నారు. కావాలనే కొంతమంది కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు చెన్నయ్య. మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లనే తగులబెట్టేందుకు ప్రయత్నించారంటే.. సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
ముందస్తు అరెస్ట్ చేసినా ఆగని రైతుల నిరసనలు
మంత్రి జగదీశ్ రెడ్డిపై ఎంపీ కోమటిరెడ్డి ఆరోపణలు
ఆదివారాలు, పండుగల రోజుల్లో డ్యూటీలకు హాజరుకాలేదని.. 57 మంది డాక్టర్లకు మెమోలు జారీ