హైదరాబాద్‌లోని తాజ్ మహల్ హోటల్‌లో దారుణం

హైదరాబాద్‌లోని తాజ్ మహల్ హోటల్‌లో దారుణం

తినే తిండిలో కల్తీ జరుగుతున్న వార్తలు నిత్యం ఏదో ఓ రూపంలో వస్తున్నాయి.  హైదరాబాద్‌ అబిడ్స్ లోని తాజ్ మహాల్ హోటల్‌లో యాజమాన్యం నిర్లక్ష్యం పప్పులో జెర్రి రూపంలో బయట పడింది. సికింద్రాబాద్ కు చెందిన అశోక్ భోజనం చేద్దామని అబిడ్స్ లోని తాజ్ మహాల్ హోటల్ కు వెళ్లాడు.  కస్టమర్ ఆర్డర్ చేసిన ఫుడ్ లో చనిపోయిన జెర్రి వచ్చింది. దీంతో అశోక్ ఒక్కసారిగా కంగుతున్నాడు. బాధితుడు జిహెచ్ఎంసి అధికారులకు ఫిర్యాదు చేశాడు.  హోటల్ లోని మిగతా కస్టమర్ లు ఆందోళనకు గురైయ్యారు. హోటల్ యాజమానిని నిలదీసి అడిగారు.

ALSO READ | హైదరాబాద్ లో హిట్ అండ్ రన్ కేసు... వ్యక్తి స్పాట్ డెడ్..