కేరళలో దారుణం.. షాపు యజమాని తాగి న్యూసెన్స్.. ఫిర్యాదు చేసిందని మహిళ సజీవ దహనం

కేరళలో దారుణం.. షాపు యజమాని తాగి న్యూసెన్స్.. ఫిర్యాదు చేసిందని మహిళ సజీవ దహనం

కాసర్‌‌గోడ్: కేరళలో దారుణం చోటుచేసుకుంది. రోజూ తాగివచ్చి న్యూసెన్స్ చేస్తున్నాడని ఓ మహిళ పక్కషాపు యజమానిపై బిల్డింగ్​ఓనర్​కు కంప్లైంట్​చేయడంతో.. నిందితుడు ఆమెపై థిన్నర్​పోసి నిప్పంటించాడు. ఈ ఘటన ఈ నెల 8న మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో కాసర్‌‌గోడ్ జిల్లాలోని బేడడుక గ్రామంలో జరిగింది. రమిత (32), రామామృతం అనే ఇద్దరు బేడడుక గ్రామంలో ఒకే బిల్డింగ్​లు వేర్వేరు షాపులు నిర్వహిస్తున్నారు. 

రమిత కిరాణా దుకాణాన్ని నడుపుతుండగా.. నిందితుడు రామామృతం ఆమె దుకాణం పక్కనే ఫర్నిచర్ షాపు నిర్వహిస్తున్నాడు. అయితే, రామామృతం రోజూ తాగి వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడని రమిత బిల్డింగ్​ఓనర్​కు ఫిర్యాదు చేసింది. దీంతో భవన యజమాని షాపు ఖాళీ చేయమని రామామృతాన్ని ఆదేశించాడు. దీంతో రమితపై కోపం పెంచుకున్న రామామృతం.. ఈ నెల 8న రమిత దుకాణంలోకి వచ్చి ఆమెపై థిన్నర్ పోసి నిప్పంటించాడు. 

దీంతో ఆమెకు 50 శాతానికి పైగా కాలిన గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆమెను కన్నడ్ జిల్లా ఆస్పత్రికి, ఆ తర్వాత మంగళూరులోని ఒక వైద్యశాలకు తరలించారు. అక్కడ ఆమె ట్రీట్​మెంట్​పొందుతూ మంగళవారం మృతిచెందింది. కాగా, ఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న సజితా పురుషోత్తమన్ అనే స్థానిక మహిళ.. రామామృతం బస్సులో పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా అతన్ని వెంబడించి, ఇతర ప్రయాణికుల సహాయంతో పట్టుకుని పోలీసులకు అప్పగించింది.  దీంతో స్థానికులు సజితను అభినందించారు.