టెన్త్ స్టూడెంట్లపై ఇంటర్​ విద్యార్థుల దాడి.. కరీంనగర్​ జిల్లా చొప్పదండి సైనిక్​ స్కూల్లో ఘటన

టెన్త్  స్టూడెంట్లపై ఇంటర్​ విద్యార్థుల దాడి.. కరీంనగర్​ జిల్లా చొప్పదండి సైనిక్​ స్కూల్లో ఘటన

చొప్పదండి, వెలుగు: కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్  సోషల్  వెల్ఫేర్  సైనిక్  స్కూల్లో గురువారం సాయంత్రం టెన్త్, ఇంటర్​ స్టూడెంట్ల మధ్య గొడవ జరిగింది. టెన్త్​ స్టూడెంట్లను ఇంటర్  విద్యార్థులు చితకబాదారు. బాధిత స్టూడెంట్స్, పేరెంట్స్  తెలిపిన వివరాల ప్రకారం.. టెన్త్, ఇంటర్  స్టూడెంట్ల మధ్య గొడవ జరిగింది. ఐదుగురు టెన్త్  స్టూడెంట్లను కొందరు ఇంటర్​ విద్యార్థులు చితకబాదారు.

ఈ విషయాన్ని నైట్​ స్టే టీచర్స్​కు, పేరెంట్స్​కు బాధిత స్టూడెంట్లు తెలిపారు. స్టూడెంట్లకు గాయాలు కావడంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో హాస్పిటల్​కు తరలించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. శుక్రవారం బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్​కు చేరుకొని ఆందోళనకు దిగారు. ఎస్సై అనూష సైనిక్​ స్కూల్​కు చేరుకొని దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తానని ప్రిన్సిపాల్​ హామీ లెటర్​ రాసి ఇవ్వడంతో ఆందోళన విరమించారు.