ఫ్రాన్స్ హైస్పీడ్ రైల్ పై దాడి.. రైళ్లకు నిప్పు పెట్టి విధ్వంసం

ఫ్రాన్స్ హైస్పీడ్ రైల్ పై దాడి.. రైళ్లకు నిప్పు పెట్టి విధ్వంసం

ఫ్రాన్స్ హై స్పీడ్ రైల్వే నెట్ వర్క్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. రైలు పట్టాలను పలుచోట్ల ధ్వంసం  చేసి..రైళ్లకు నిప్పు పెట్టి విధ్వంసం సృష్టించారు. మరికొన్ని గంటల్లో ఒలింపిక్స్ గేమ్స్ ప్రారంభం అవుతాయనడానికి ముందు ఈ ఘటన జరిగింది. దీంతో 8లక్షల మంది ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఘటనపై ఉన్నతస్థాయి విచారణ దర్యాప్తు  చేస్తున్నామన్నారు.

 అట్లాంటిక్, నార్తర్న్ , ఈస్ట్రన్ రైల్వే నెట్ వర్క్ దెబ్బతిన్నదన్నారు.ఒలింపిక్స్  గేమ్స్ కు.. రైల్వే నెట్ వర్క్ పై అటాక్ లకు సంబంధం ఉందా అన్న కోణంలో విచారణ చేస్తున్నామన్నారు అధికారులు. నెట్ వర్క్ ను పునరుద్ధరించడానికి రెండు మూడు రోజుల సమయం పడుతుందన్నారు ఆఫీసర్లు.