అనాథ బాలికతో అసభ్యంగా  ప్రవర్తించిన అటెండర్ అరెస్ట్

అనాథ బాలికతో అసభ్యంగా  ప్రవర్తించిన అటెండర్ అరెస్ట్

యాదాద్రి : అనాథ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలో బాల సదనం అటెండర్ ను అరెస్ట్ చేసిన ఘటన యాదాద్రి జిల్లాలో ఆలస్యంగా తెలిసింది. ఓ అనాథ బాలిక(13) ఒకటి నుంచి 6    వరకు భువనగిరి ఎలిగెబెర్త్ స్కూల్ లో చదివింది. ప్రస్తుతం వలిగొండ శాంతి నిలయం స్కూల్​లో చదువుతూ దసరా సెలవులకు భువనగిరిలోని బాలసదనానికి వెళ్లింది. అంతర్జాతీయ బాలికల దినోత్సం సందర్భంగా ఈనెల14న బాల సదనం ఇన్​చార్జ్ లలిత ఆధ్వర్యంలో ప్రోగ్రామ్ నిర్వహించారు. అనాథ బాలిక వాష్ ​రూమ్​కు వెళ్లడం అటెండర్​ వెంకటరెడ్డి చూశాడు. ఆమె వెనకే వెళ్లిన అతను వాష్​ రూమ్​ నుంచి బాలిక బయటకు రాగా నోరు మూసి ఆమె శరీరంపై చేతులతో తాకాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.

దీంతో బాలిక  ఇన్​చార్జ్​ లలితతో ఏడ్చుకుంటూ చెప్పగా  నచ్చజెప్పింది.  అనంతరం బాలిక  స్కూల్​కు వెళ్లినా.. మనస్తాపంతో  కనిపించడంతో ఆరా తీయగా జరిగిన విషయం చెప్పింది.  దీంతో యాదాద్రి డీసీపీవో సైదులుకు తెలుపగా  శాంతి నిలయం స్కూల్​కు వెళ్లి బాలికను విచారించగా అటెండర్ వెంకటరెడ్డి తనపై అసభ్యంగా ప్రవర్తించిన విషయం తెలిపింది. దీంతో భువనగిరి టౌన్​ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోక్సో కేసు నమోదు చేసి అటెండర్ ని అరెస్ట్ చేసి సోమవారం​ రిమాండ్​కు తరలించారు.  నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల పరిరక్షణ వేదిక, హ్యూమన్ రైట్స్ కమిషన్, ఏఐఎస్ఎఫ్ సంఘాలు కలెక్టర్​హనుమంతు జెండగేకు ఫిర్యాదు చేశాయి.