
కాన్బెర్రా: మా దేశంలో మస్తు ఉద్యోగాలు ఉన్నయ్.. స్టూడెంట్లకు చీప్గా వీసాలిస్తాం రండి అని ఆస్ట్రేలియా ప్రధాని మంత్రి స్కాట్ మారిసన్ ప్రకటించారు. స్టూడెంట్ లేదా వర్కింగ్ హాలిడే వీసాపై ఆస్ట్రేలియా వచ్చే వారికి అప్లికేషన్ ఫీజుపై రిబేట్ ఇస్తామని ఆయన పేర్కొన్నారు. కొన్ని నెలలుగా కరోనా వ్యాప్తి పెరిగి దేశంలో రికార్డు స్థాయిలో ఉద్యోగాలు ఖాళీ అయ్యాయి. సూపర్ మార్కెట్లు, లాజిస్టిక్, హాస్పిటాలిటీ, అగ్రికల్చర్ తదితర రంగాల్లో మ్యాన్పవర్ కొరత తీవ్రమైంది. దేశ ఆర్థిక వ్యవస్థపై ఎఫెక్ట్పడనున్న క్రమంలో విదేశీ ఉద్యోగులతో ఖాళీలను భర్తీ చేయడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం వీసాలపై రిబేట్ ప్రకటించింది. బుధవారం కాన్బెర్రాలో నిర్వహించిన ఓ ప్రెస్ కాన్ఫరెన్స్లో దేశ ప్రధాని స్కాట్ మారిసన్ మాట్లాడుతూ.. మేము తీసుకున్న నిర్ణయం దేశంలో ఉద్యోగుల కొరతను తీరుస్తుందని ఆశిస్తున్నాం.. ‘కమాన్ ఆస్ట్రేలియా రండి.. ఇప్పుడే రండి’ అని ఆయన పిలుపునిచ్చారు. అయితే రిబేట్ ఎలా ఉంటుందనే విషయం చెప్పలేదు. వచ్చే 8 వారాల వరకు స్టూడెంట్లకు వీసాలపై రిబేట్వర్తిస్తుందని పేర్కొన్నారు. కాగా ప్రభుత్వం వీసాలపై ప్రకటించిన రిబేట్కు దాదాపు 55 మిలియన్ల ఆస్ట్రేలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని అంచనా. ఈ పాలసీతో 1,75, 000 మంది వీసాలకు దరఖాస్తు చేస్తారని ప్రభుత్వం ఆశిస్తున్నట్లు ట్రెజరర్ జోస్ ఫ్రైడెన్బర్గ్చెప్పారు. కాగా ఆస్ట్రేలియా విదేశీ కార్మికులపై చాలా ఆధారపడుతోందని, కరోనాతో వచ్చిన ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడాలంటే దేశంలో నిరుద్యోగులకు స్కిల్స్అందించాల్సిన అవసరం ఉందని ప్రతిపక్షనేత ఆంథోనీ అల్బనీస్ తెలిపారు.