
కొమురవెల్లి మండలంలోని తపాస్పల్లి రిజర్వాయర్ లోకి మంగళవారం అధికారులు గోదావరి జలాలను విడుదల చేశారు. దీంతో కొమురవెల్లి, చేర్యాల మండలంతో పాటు చుట్టు పక్కల వివిధ మండలాలకు చెందిన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సిద్దిపేట వైపునకు తపాస్పల్లి రిజర్వాయర్నీటిని తరలించడాన్ని ఈ ప్రాంత ప్రజలు వ్యతిరేకించారు. ఇప్పటికైనా ఈ రిజర్వాయర్ కెపాసిటి పెంచి అందరికీ సాగునీరు అందించాలని రైతులు కోరుతున్నారు.
- కొమురవెల్లి, వెలుగు