అసెంబ్లీ సమావేశాలు కాగానే ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తం

అసెంబ్లీ సమావేశాలు కాగానే ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తం
  • మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ 

బషీర్​బాగ్, వెలుగు: అసెంబ్లీ సమావేశాలు పూర్తికాగానే ఆటోడ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఆవరణలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్యెల్యే కూనంనేని సాంబశివరావుతో కలసి ఏఐటీయూసీ ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు వి.ఎస్.బోస్, ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్స్ జేఏసీ కన్వీనర్ బి.వెంకటేశం మంత్రి పొన్నం ప్రభాకర్ కు వినతిపత్రం అందజేశారు. 

గత నెలలో జరిపిన చర్చల్లో ఏప్రిల్ లో ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తామని ఇచ్చిన హామీని గుర్తుచేశారు. ఏడాదికి రూ.12 వేలు, ఫ్యుయెల్​చార్జీలకు అనుగుణంగా ఆటో మీటర్ చార్జీలు పెంపు, రవాణా కార్మికుల సంక్షేమ బోర్డు, రవాణా యాప్ ఏర్పాటు, కొత్త ఆటో పర్మిట్ల మంజూరు, స్కూల్ వ్యాన్లు, ఓలా, ర్యాపిడో, ఉబెర్ బైక్​లు నిషేదం, ఇతర జిల్లాల ఆటోలను సిటీలోకి రాకుండా నిషేధించడం వంటి ప్రధాన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు