ఆటో సేల్స్​ 7 శాతం అప్.. 16 శాతం పెరిగిన పీవీల అమ్మకాలు

ఆటో సేల్స్​ 7 శాతం అప్.. 16 శాతం పెరిగిన పీవీల అమ్మకాలు

న్యూఢిల్లీ: మన దేశంలో వాహనాల రిటైల్​అమ్మకాలు గత నెలలో ఏడు శాతం పెరిగి 22,91,621 యూనిట్లకు చేరాయి. గత ఏడాది జనవరిలో 21,49,117 యూనిట్లు అమ్ముడయ్యాయని ఫెడరేషన్​ ఆఫ్​ ఆటోమొబైల్​ డీలర్స్ అసోసియేషన్స్​(ఫాడా) తెలిపింది. ప్యాసింజర్​ వెహికల్స్​(పీవీ) అమ్మకాలు ఏడాది ప్రాతిపాదికన 16 శాతం ఎగిసి 4,65,920 యూనిట్లకు చేరాయని ఫెడరేషన్​ప్రెసిడెంట్​ సీఎస్​ విఘ్నేశ్వర్​ చెప్పారు. 

టూవీలర్లు, త్రీవీలర్లు, ట్రాక్టర్లు, కమర్షియల్​ వెహికల్స్​అమ్మకాలు కూడా బాగున్నాయని చెప్పారు. ఇన్వెంటరీ స్థాయిలు 50–55 రోజుల స్థాయికి పడిపోయాయి. టూవీలర్ల అమ్మకాలు నాలుగు శాతం పెరిగి 15,25,862 యూనిట్లకు చేరాయి. కమర్షియల్​ వెహికల్స్​ అమ్మకాలు ఎనిమిది శాతం పెరిగి 99,425 యూనిట్లకు ఎగిశాయి. ట్రాక్టర్​ సేల్స్ ​ఐదు శాతం పెరిగి 93,381 యూనిట్లకు చేరాయి.