హైదరాబాద్, వెలుగు: ఎక్సెస్ బ్యాగేజీ ప్రొవైడర్ అవాన్ ఎక్సెస్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తన కార్యకలాపాలను ప్రారంభించినట్లు ప్రకటించింది. తక్కువ ఖర్చుతో కూడిన బ్యాగేజ్, ప్యాకేజ్ డెలివరీ సేవలని అందిస్తామని సంస్థ సీఈఓ మీరా సింగ్ అన్నారు. తమ సేవల వల్ల ప్రయాణికులతోపాటు పిల్లలతో గడిపే మహిళలు, సీనియర్ సిటిజన్లు, వికలాంగ ప్రయాణీకులకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొంది.
కిలోకు కేవలం రూ.89 మాత్రమే వసూలు చేస్తున్నామని, ఎయిర్లైన్స్ కంపెనీలు ఎక్సెస్ బ్యాగేజ్ కోసం కిలోకు రూ. 500 వసూలు చేస్తున్నాయని మీరా వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన విమానాశ్రయాలకు తమ సేవలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు.