వికారాబాద్, వెలుగు: కరీంనగర్లో జరిగిన 3వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పొర్ట్స్ మీట్లో వికారాబాద్ జిల్లా పోలీస్ అధికారులు 7 పతకాలు సాధించారు. వీరిని ఎస్పీ నారాయణరెడ్డి సోమవారం సన్మానించారు. మున్ముందు మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.
కనోయింగ్లో అబ్దుల్ మన్సూర్ సిల్వర్, హైజంప్లో కె.స్వాతి సిల్వర్, బాక్సింగ్లో టి.ప్రకాశ్ కాంస్యం, హైజంప్లో ఏ.శివ దర్శన్ కాంస్యం, టైక్వాండోలో ఎన్ శ్రీను, జి.శ్రీనివాస్ కాంస్య పతకాలు, స్విమ్మింగ్లో రవీందర్ కాంస్య పతకం సాధించినట్లు తెలిపారు.