
ములుగు/వెంకటాపూర్/కొత్తగూడ/మంగపేట, వెలుగు : బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని ములుగు నియోజకవర్గ క్యాండిడేట్ బడే నాగజ్యోతి పిలుపునిచ్చారు. ములుగు జిల్లా వెంకటాపూర్లో గురువారం జరిగిన మీటింగ్లో ఆమె మాట్లాడారు. అభివృద్ధి చేయని కాంగ్రెస్కు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. మండల అధ్యక్షుడు లింగాల రమణారెడ్డి, ఎన్నికల ఇన్చార్జి సాంబారి సమ్మారావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్నాయక్, జడ్పీటీసీ రుద్రమదేవి అశోక్, ఎంపీపీ బుర్ర రజిత సమ్మయ్య పాల్గొన్నారు.
అలాగే ములుగు ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ క్యాండిడేట్ నాగజ్యోతిని గెలిపించాలంటూ ఆ పార్టీ లీడర్లు గురువారం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎంచగూడెం, సాధిరెడ్డిపల్లి, కోనాపురంలో ర్యాలీ నిర్వహించారు. ములుగు జిల్లా మంగపేట మండలం తిమ్మంపేట క్రాస్లో జరిగిన క్లస్టర్ ఇన్చార్జ్ల మీటింగ్లో రోడ్లు భవనాల కార్పొరేషన్ చైర్మన్, మూడు మండలాల ఇన్చార్జి మెట్టు శ్రీనివాస్ మాట్లాడారు. బీఆర్ఎస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సూచించారు.