
మెదక్ టౌన్, వెలుగు: స్టూడెంట్లు సోషల్మీడియాలో జాగ్రత్తగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో మెదక్ డీఎస్పీ సుభాష్చంద్రబోస్ తెలిపారు. బుధవారం మెదక్లోని గీతా జూనియర్ కాలేజీలో ‘సైబర్ జాగరూకత దివస్’ పేరుతో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
జిల్లా ఏఎస్పీ మహేందర్తోపాటు సుభాష్ చంద్రబోస్ పాల్గొని సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఫేక్ బ్యాంక్ కాల్ఫ్రాడ్స్, డెబిట్, క్రెడిట్ కార్డ్, అడ్వర్జైజ్మెంట్ఫ్రాడ్స్, లోన్ యాప్ ఫ్రాడ్స్ వివరించారు. బాధితులు 1930 టోల్ ఫ్రీ నెంబర్ లేదా https://cybercrime.gov.in/ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని సూచించారు. కార్యక్రమంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో సీఐ సురేశ్, కానిస్టేబుల్ సతీశ్, కాలేజీ కరెస్పాండెంట్ ప్రసాద్రావు, ప్రిన్సిపాల్ సాయిరామ్, సెక్టోరియల్ఆఫీసర్ సతీశ్కుమార్ పాల్గొన్నారు.