కాశీబుగ్గ/ జనగామ అర్బన్, వెలుగు : క్యాన్సర్ నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పలువురు వక్తలు అన్నారు. వ్యాధి మొదటి దశలోనే జాగ్రత్తలు తీసుకుంటే త్వరగా నివారించవచ్చని తెలిపారు. వరల్డ్ క్యాన్సర్డే సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అవగాహన ర్యాలీలు, సదస్సులు నిర్వహించారు.
వరంగల్ జిల్లా వైద్యారోగ్య ఆఫీస్లో నిర్వహించిన మీటింగ్లో డీఎంహెచ్వో సాంబశివరావు, జనగామలో లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో ఎంసీహెచ్లో నిర్వహించిన సదస్సులో జనగామ జిల్లా కోర్టు సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్ డీఎంహెచ్వో మల్లికార్జున్ రావు కలిసి పాల్గొని వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలపై వివరించారు. కాళోజీ కళాక్షేత్రంలో ప్రతిమట్రస్ట్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ, సదస్సులో ఎంపీ కడియం కావ్య, సినీ నటి గౌతమి పాల్గొని మాట్లాడారు.