250 కోట్ల ఏళ్ల క్రితం నాటి బ్లాక్ గ్రానైట్తో తయారు చేసిన బాల రాముడి విగ్రహాన్ని అయోధ్య రామాలయంలో ప్రతిష్ఠించారు. ముగ్గురు శిల్పులు మూడు వేర్వేరు బాలరాముడి విగ్రహాలు తయారు చేయగా.. అందులో ఒక విగ్రహాన్ని మాత్రమే గర్భగుడిలో ఉంచారు. మిగిలిన రెండు విగ్రహాలను అలాగే ఉంచారు. అయితే ఇప్పటికే రెండో విగ్రహం ఫోటోలు వైరల్ కాగా.. తాజాగా మూడో విగ్రహం చిత్రాలు బయటికి వచ్చాయి.
కర్ణాటకకు చెందిన శిల్పి గణేష్ భట్ చెక్కిన బాల రాముడి విగ్రహానికి చెందిన ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది.ఈ విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో విగ్రహాన్ని ప్రతిష్టించనున్నట్లు ఆలయ ట్రస్ట్ పేర్కొంది.ఈ పురాతన రాయి మైసూరులోని గుజ్జేగౌడనపుర గ్రామంలోని గనుల నుంచి వెలికి తీశారు.
అరుణ్ యోగిరాజ్ రూపొందిన విగ్రహాన్ని ప్రతిష్ఠించగా కర్నాటకకు చెందిన గణేష్ భట్... సత్యనారాయణ పాండే తయారు చేసిన విగ్రహాలు ప్రస్తుతం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వద్దే ఉన్నాయి. ఆ విగ్రహాలను అయోధ్య ఆలయంలోనే ప్రతిష్ఠించనున్నట్లు ఇప్పటికే ట్రస్ట్ వర్గాలు వెల్లడించాయి. అయోధ్య ఆలయాన్ని మొత్తం 3 అంతస్థుల్లో నిర్మిస్తుండగా.. ప్రధాన గర్భగుడి గ్రౌండ్ ఫ్లోర్లో ఏర్పాటు చేశారు. ఇక మొదటి, 2 అంతస్థుల్లో కూడా ఆలయాలు నిర్వహిస్తామని తెలిపారు. అయితే ఈ మిగిలిన రెండు విగ్రహాలను రెండు అంతస్థుల్లో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
గణేష్ భట్ కూడా కృష్ణ శిలతోనే బాల రాముడి విగ్రహాన్ని తయారు చేశారు. ఇక మరో విగ్రహాన్ని రాజస్థాన్లోని జైపూర్కు చెందిన సత్యనారాయణ పాండే అనే శిల్పి తయారు చేశారు. తెల్లని మక్రానా పాలరాతితో రూపొందించిన ఆ విగ్రహానికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే విడుదల అయ్యాయి. అయితే ఈ మూడు విగ్రహాలు కూడా ఒకే ఎత్తులో 51 అంగుళాలు ఉండేలా చెక్కాలని శిల్పులకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సూచించింది.
అయోధ్యలో 51 అంగుళాల ఎత్తైన దివ్యమైన బాలరాముడి విగ్రహం కొలువుదీరింది. అయితే అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ 3 విగ్రహాలను తయారు చేయించింది. ఒక విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠించగా.. మరో విగ్రహానికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే బయటికి వచ్చాయి. ఇక చివరగా మిగిలిన మూడో బాల రాముడి విగ్రహం ఫోటో కూడా వైరల్గా మారింది. దీంతో అయోధ్యలో ఉంచేందుకు తయారు చేసిన మూడు రాముడి విగ్రహాలకు సంబంధించిన ఫోటోలు బయటికి వచ్చినట్లు అయింది.