
శ్రీరామ నవమి శుభ సందర్భంగా అయోధ్య రామాలయంలో అద్భుతం చోటుచేసుకుంది. నవమి రోజున బాలరామయ్యకు మధ్యాహ్నం12 గంటలకు అభిషేకం నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం12 గంటలకు సూర్యకిరణాలు బాలరాముడి నుదిటిపై నాలుగు నిమిషాల పాటు ప్రసరించాయి. ఈ దివ్యఘట్టాన్ని 'సూర్య తిలకం' అని పిలుస్తారు.
#WATCH | ‘Surya Tilak’ illuminates Ram Lalla’s forehead at the Ram Janmabhoomi Temple in Ayodhya, on the occasion of Ram Navami
— ANI (@ANI) April 6, 2025
'Surya Tilak' occurs exactly at 12 noon on Ram Navami when a beam of sunlight is precisely directed onto the forehead of the idol of Ram Lalla, forming… pic.twitter.com/gtI3Pbe2g1
ఆలయంలో జరిగిన అద్భుతాన్ని యావత్ దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామ భక్తులు తిలకించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఆలయ ట్రస్ట్. ఈ దివ్య సంఘటన రాముడి జననాన్ని ప్రతీకగా సూచిస్తుంది. సూర్యకిరణం దేవత నుదిటిపై ప్రకాశింపజేసి వేడుకలకు ఆధ్యాత్మిక ప్రకాశాన్ని జోడించింది.
►ALSO READ | దేశంలోనే తొలి లిఫ్ట్ బ్రిడ్జ్(పంబన్ వంతెన)..ఇవాళ(ఏప్రిల్ 6) ప్రారంభోత్సవం