హైదరాబాద్, వెలుగు: సామాజిక న్యాయం, సబ్బండ కులాలకు రాజకీయ అధికారం అజెండాతో ఆదివారం బీసీల సింహగర్జన సభ నిర్వహిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. సభ నిర్వహించనున్న ఎల్బీ నగర్ సరూర్నగర్ స్టేడియాన్ని శనివారం ఆయన పరిశీలించారు. సింహగర్జన సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు.
పార్టీలకతీతంగా నేతలు సభకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మహాసభకు బీఆర్ఎస్ ఎంపీ కె. కేశవరావు, బీజేపీ ముఖ్య నేతలు, కాంగ్రెస్ నేతలు మధుయాష్కీ గౌడ్, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, మంద కృష్ణ, విశారదన్ మహరాజ్, జి. చెన్నయ్య తదితరులు హాజరవుతారని చెప్పారు.