గుడిమల్కాపూర్ లో జింక పిల్ల ప్రత్యక్షం

గుడిమల్కాపూర్ లో జింక పిల్ల ప్రత్యక్షం

మెహిదీపట్నం, వెలుగు: మెహిదీపట్నం గుడిమల్కాపూర్ లోని మదీన్ మసీదు వద్ద గురువారం ఉదయం 5 నెలల జింక పిల్ల ప్రత్యక్షమైంది. అప్పటికే కుక్కలు వెంట పడడంతో స్థానికులు జింక పిల్లను రక్షించి, డయల్​100కు సమాచారం ఇచ్చారు. దీంతో ఆసిఫ్​నగర్​పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని జింకను స్థానికుల సహాయంతో సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు అప్పజెప్పినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. అయితే, ఈ జింక పిల్ల ఎక్కడ్నుంచి వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.