హైదరాబాద్​ లో ఘోరం: MMTS ట్రైన్​లో మహిళపై అత్యాచార యత్నం.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

హైదరాబాద్​ లో ఘోరం: MMTS ట్రైన్​లో మహిళపై అత్యాచార యత్నం.. ఆ తరువాత  ఏం జరిగిందంటే..

ప్రభుత్వాలు మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా.. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా. ఆగడాలు ఆగడం లేదు.  దేశంలో నిత్యం ఏదో ఒక చోట మహిళలపై దాడులు జరుగుతున్నాయి.  తాజాగా హైదరాబాద్​ ఎంఎంటీఎస్​ లో ఓ యువకుడు అత్యాచారయత్నానికి వడిగట్టాడు.  ఈ ఘటన విషయంలో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...

  జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...  సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తున్న ఎంఎంటిఎస్ ట్రైన్‌లో ఒంటరిగా ఉన్న యువతిపై ఓ దుండగుడు  ఆదివారం రాత్రి ( మార్చి 23 ) అత్యాచారయత్నం చేశాడు.. దీంతో  కదులుతున్న ట్రైన్‌లో  నుంచి బాధితురాలు  ఒక్కసారిగా దూకేసింది.. దీంతో యువతికి తీవ్రగాయాలయ్యాయి.  తీవ్రగాయాలపాలైన ఆ యువతిని పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న సికింద్రాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. దుండగుడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.

బాధితురాలు మేడ్చల్​ లో ప్రైవేట్​ జాబ్​ చేస్తుంది.  తన ఫోన్​ చెడిపోవడంతో రిపేర్​ చేయించుకుని.. సికింద్రాబాద్​ నుంచి మేడ్చల్​ కు ఎంఎంటీఎస్​ ట్రైన్​ లో వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.  మహిళల కోచ్​ లో  బాధితురాలు ఒక్కరే ఉండటాన్ని గమనించిన ఓ యువయుడు అత్యాచారానికి యత్నించాడు.  ఆమె తప్పించుకునే క్రమంలో కదిలే రైలు నుంచి దూకింది.   ఈ ఘటన కొంపల్లి బ్రిడ్జి వద్ద జరిగింది.  సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి బాధితురాలిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.  సీసీ ఫుటేజ్​ను పరిశీలించిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.