![IPL 2025: ముంబై ఇండియన్స్కు బ్యాడ్న్యూస్.. ఐపీఎల్ నుండి ‘మిస్టరీ స్పిన్నర్’ ఔట్](https://static.v6velugu.com/uploads/2025/02/bad-news-for-mumbai-indians-mystery-spinner-ruled-out-of-ipl-2025_KnzGOQxpJv.jpg)
ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్(Mumbai Indians)కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. గాయం కారణంగా ఆఫ్ఘనిస్తాన్ యువ సంచలనం అల్లా గజన్ఫర్(Allah Ghazanfar) ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఐపీఎల్ 2025 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.
ఇటీవల జింబాబ్వే పర్యటనలో ఈ 18 ఏళ్ల మిస్టరీ స్పిన్నర్కు వెన్నుపూసలో పగులు వచ్చింది. దాంతో, నాలుగు నెలల పాటు ఇతడు ఆటకు దూరంగా ఉంటాడని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటన చేసింది. అతని లోటు ఆఫ్ఘనిస్తాన్, ముంబై ఇండియన్స్ జట్లకు భారీ దెబ్బె అని చెప్పుకోవాలి.
Also Read :- సెంచరీతో రెచ్చిపోయిన గిల్
ఆఫ్ఘనిస్తాన్ తరఫున ఇప్పటివరకు ఒక టెస్ట్, 11 వన్డేలు ఆడిన గజన్ఫర్ను ఐపీఎల్ 2025 మెగా వేలంలో ముంబై యాజమాన్యం రూ.4.80 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. ఈ 18 ఏళ్ల మిస్టరీ స్పిన్నర్ ముంబై తుది జట్టులో ఖచ్చితమైన ప్లేయర్గా కనిపించాడు. పవర్ ప్లే పరుగులు ఇవ్వకుండా కట్టడి చేయగల సమర్థుడు. అటువంటిది అతడు దూరమవ్వడం ముంబై ఇండియన్స్కు భారీ దెబ్బే. షార్జా వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన ఓ మ్యాచ్లో గజన్ఫర్ 26 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు.
🚨 ALLAH GHAZANFAR RULED OUT OF CHAMPIONS TROPHY & IPL 2025 🚨
— Johns. (@CricCrazyJohns) February 12, 2025
- Afghanistan Cricket Board confirms he will be out for a minimum of 4 months due to injury.
He was picked by Mumbai Indians in the IPL. pic.twitter.com/4js1zEgSJ5