
నితిన్ హీరోగా నటించిన చిత్రాల్లో 'గుండెజారి గల్లంతయ్యిందే' ఒకటి. విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా వర్క్ చేశారు. దీనిపై ఆమె స్పందించారు. నితిన్ సినిమాలో యాక్ట్ చేయడాని కంటే ముందు నాకు ఎన్నో సినిమాల్లో అవకాశాలు వచ్చాయని చెప్పింది. నితిన్ తనకు ఎంతోకాలంగా తెలు సంటోంది. తను నాకు మంచి స్నేహితుడని చెప్పింది.
ఓసారి తామంతా పార్టీలో ఉన్నప్పుడు తన సినిమాలో స్పెషల్ సాంగ్ ఉందని, అందులోడ్యాన్స్ చేయమని తనను అడిగాడని అందుకు తాను ఓకే అని చె ప్పానని తెలిపింది. తన కోసమే అందులో యాక్ట్ చేశానని తెలిపింది. ఆ పాట వల్ల జరిగిన మంచి ఏదైనా ఉందంటే.. అప్పటివరకూ నితిన్ నటించిన చాలా సినిమాలు సరైన విజయాన్ని అందుకోలేకపోయాయని చెప్పింది. తాను భాగమైన ‘గుండెజారి గల్లంతయ్యిందే' మంచి విజయాన్ని అందుకుందని తెలిపింది.
Also Read:-బ్రేకప్ తూచ్.. ప్రియుడితో కలసి హొలీ వేడుకల్లో తమన్నా..?
నేషనల్ మీడియాలో కూడా ఆర్టికల్స్ వచ్చాయని, 'నీ వల్లే నా సినిమాకు నేషనల్ మీడి యాలోనూ ప్రమోషన్స్ జరుగుతోందని నితిన్ అనేవాడని ఆ రోజులను గుర్తు చేసుకుంది గుత్తా జ్వాల. ఇప్పుడు దాని గురించి మాట్లాడాలంటే కాస్త ఇబ్బందిగా ఉంటుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది జ్వాల.
ఈ విషయం ఇలా ఉండగా గుత్తా జ్వాలా 2021లో తమిళ్ ప్రముఖ హీరో విష్ణు విశాల్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత పర్సనల్ లైఫ్ లో బిజీగా ఉంటోంది. దీంతో బ్యాడ్మింటన్ ఆటపై కూడా పెద్దగా దృష్టి సారించడం లేదు. ప్రస్తుతం గుత్తా జ్వాలా తన భర్తతో కలసి చెన్నైలో నివాసముంటున్నట్లు సమాచారం.