
ఉప్పునుంతల, వెలుగు: ఉప్పునుంతల గ్రామానికి చెందిన మర్యాద రుక్మారెడ్డి మండల కేంద్రంలోని బాలుర, బాలికల పాఠశాలల్లో చదువుతున్న స్టూడెంట్లకు స్టడీ బ్యాగులు పంపిణీ చేశారు. బాయ్స్ స్కూల్లో చదువుకున్న రుక్మారెడ్డి ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డారు. తన సోదరుడు కృష్ణారెడ్డితో స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. హెచ్ఎంలు శ్రీనివాస్ రెడ్డి, కట్ట నరసింహారెడ్డి, లక్ష్మీనారాయణ, టీచర్లు బాలామణి, వెంకటేశ్, వెంకటలక్ష్మి, రామచంద్రారెడ్డి, శేఖర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.