
జీడిమెట్ల, వెలుగు: బాలానగర్లో ఆదివారం రోడ్డు ప్రమాదం జరగగా, ట్రాఫిక్ కానిస్టేబుల్ గోపాల్పై వచ్చిన ఆరోపణలపై డీసీపీ సురేశ్కుమార్ వివరణ ఇచ్చారు. సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఆదివారం ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధిస్తున్న సమయంలో అటుగా వచ్చిన బైక్ రైడర్ జోషిబాబు(35)ను ట్రాఫిక్ కానిస్టేబుల్ గోపాల్ ఆపాడన్నారు. దీంతో చలానా పడుతుందనే భయంతో అతడు తప్పించుకునే ప్రయత్నం చేయగా, బస్సు ఢీ కొని మృతి చెందాడన్నారు.
గోపాల్కు బ్రీత్ఎనలైజర్ టెస్టుతోపాటు బడ్ల్ టెస్ట్ సైతం చేయగా, అతని బ్లడ్లో ఆల్కహాల్ లేదని తేలిందన్నారు. బైక్ రైడర్పై కూడా చేయలేదన్నారు. ఆ వీడియో ఫుటేజీలను బాధిత కుటుంబ సభ్యులకు చూపించామన్నారు. ఘటనపై కేసు నమోదు చేశామని, విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు.