Live Updates: బాలాపూర్ గణేష్ శోభాయాత్ర...

Live Updates: బాలాపూర్ గణేష్ శోభాయాత్ర...

బాలాపూర్ గణేష్ శోభాయాత్ర శోభాయమానంగా కొనసాగుతోంది.. బాలాపూర్ నుండి ఉదయం ప్రారంభమైన యాత్ర ప్రస్తుతం ఎంజే మార్కెట్ చేరుకుంది. బాలాపూర్ హనుమాన్ టెంపుల్ నుంచి ఊరేగింపు మొదలై గణేశ్​చౌక్ ఎడమ వైపు నుంచి డైమండ్ హోటల్ చేరుకున్న బాలాపూర్ గణేశుడు అక్కడి నుంచి మైసమ్మకట్ట మీదుగా చాంద్రాయణగుట్ట, చార్మినార్, అఫ్జల్‌గంజ్‌,ఎంజే మార్కెట్ కు చేరుకుంది.. అబిడ్స్, బషీర్‌‌బాగ్‌, లిబర్టీ వై జంక్షన్‌ మీదుగా ట్యాంక్​బండ్​కు చేరుకోనున్నాడు బాలాపూర్ గణేశుడు.

ALSO READ | స్పాట్లోనే రూ.30 లక్షలు కట్టేసిన భక్తుడు.. బాలాపూర్ లడ్డూ దక్కించుకున్న ఈ శంకర్ రెడ్డి ఎవరు..?

కాగా, తెలుగు రాష్ట్రాల్లో వేలానికి ప్రసిద్ధి గాంచిన బాలాపూర్ గణేశుడి లడ్డు ఈ ఏడాది ( 2024 ) 30 లక్షల వెయ్యి రూపాయలు పలికింది.. కొలన్ శంకర్ రెడ్డి అనే వ్యక్తి బాలాపూర్ లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్నారు.గత ఏడాది కంటే.. ఈసారి 3 లక్షల రూపాయలు అదనంగా పలికింది. బాలాపూర్ లడ్డూ వేలంలో ఇదే రికార్డ్.