బాలాపూర్ లడ్డూ ప్రసాదం 30 లక్షల వెయ్యి రూపాయలు

బాలాపూర్ లడ్డూ ప్రసాదం 30 లక్షల వెయ్యి రూపాయలు

బాలాపూర్ లడ్డూ ప్రసాదం వేలం ముగిసింది. 2024లో.. ఈసారి లడ్డూ ప్రసాదం 30  లక్షల వెయ్యి  రూపాయలకు.. కొలన్ శంకర్ రెడ్డి అనే వ్యక్తి దక్కించుకున్నారు. 

గత ఏడాది కంటే.. ఈసారి 3 లక్షల రూపాయలు అదనంగా వెళ్లింది వేలం. 
బాలాపూర్ లడ్డూ వేలంలో ఇదే రికార్డ్.

బాలాపూర్ లడ్డూ ప్రసాదం హోరాహోరీగా సాగింది. 
లక్ష్మీనారాయణ, ప్రణీత్ రెడ్డి, కొలన్ శంకర్ రెడ్డి, దశరథగౌడ్ నలుగురు వ్యక్తులు గట్టిగా పోటీపడ్డారు.
నలుగురు వ్యక్తులు లడ్డూ ప్రసాదం దక్కించుకునేందుకు చివరి వరకు పోటీ పడ్డారు.
చివరకు 30 లక్షల వెయ్యి రూపాయలకు కొలన్ శంకర్ రెడ్డి బాలాపూర్ లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు.