
పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ వరుస బాంబు పేలుళ్లతో అట్టుడికి పోతోంది. గురువారం జరిగిన బాంబు దాడిలో ముగ్గురు మృతిచెందిన ఘటన మరువక ముందే మరోసారి బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాలో బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో నలుగురు పాకిస్తాన్ ఆర్మీ చనిపోయారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.
పాకిస్తాన్ లోని అల్లర్ల జరుగుతున్న నైరుతి ప్రాంతంలో భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్న వెహికల్ కు సమీపంలో బాంబు పేలింది. అయితే ఈదాడికి ఏ గ్రూప్ బాధ్యత వహించనప్పటికీ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పనే అనే తెలుస్తోంది. BLF తరచుగా ప్రావిన్స్లోని భద్రతా దళాలను లక్ష్యంగా దాడులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
పాకిస్తాన్లోని బలూచిస్తాన్ గత కొంతకాలంగా వేర్పాటు వాదుల తిరుగుబాటుతో అట్టుడికి పోతోంది. ఈ ప్రావిన్స్లో 2019లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ని యునైటెడ్ స్టేట్స్ ఉగ్రవాద సంస్థగా గుర్తించారు. ఈ ఉగ్రవాద సంస్థ ఆధ్వర్యంలో అనేక దాడులు జరిగాయి.