మే 5 నుంచి బాలోత్సవం సమ్మర్ క్యాంప్

మే 5 నుంచి బాలోత్సవం సమ్మర్ క్యాంప్

ముషీరాబాద్, వెలుగు: పిల్లల్లో సృజనాత్మకత, విలువలు, ఆత్మగౌరవం పెంపొందించేలా, అనుభవ పూర్వక జ్ఞానాన్ని అందించేలా మే 5  నుంచి 22 వరకు తెలంగాణ బాలోత్సవం ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంపు నిర్వహించనున్నట్లు అధ్యక్ష కార్యదర్శులు భూపతి వెంకటేశ్వర్లు, ఎన్.సోమన్న తెలిపారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమ్మర్​ క్యాంప్ ​ఉంటుందన్నారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో క్యాంప్​ పోస్టర్​ను ఆవిష్కరించి మాట్లాడారు.

మహనీయులు, త్యాగధనుల స్ఫూర్తి నింపడం, నాయకత్వ లక్షణాలు, వ్యక్తిత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే సమ్మర్ ​క్యాంప్​ లక్ష్యమన్నారు. ఆసక్తిగా ఉన్నవారు ఈ నెల 15 నుంచి 30 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 94900 94676/94900 98343లో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో కవయిత్రి సుజావతి, రూప రుక్మిణి, బ్రాహ్మణి తదితరులు పాల్గొన్నారు.