![6.18లక్షల ఎకరాల్లో వెదురు సాగు లక్ష్యం : కలెక్టర్ జితేశ్ వి పాటిల్](https://static.v6velugu.com/uploads/2025/02/bamboo-cultivation-target-in-618-lakh-acres-collector-jitesh_k90xtH7zqh.jpg)
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో 6.18లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్దేశించినట్టు కలెక్టర్ జితేశ్ వి పాటిల్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో ఇండస్ట్రీ క్రాఫ్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు శాఖల ఆఫీసర్లతో సోమవారం నిర్వహించిన శిక్షణా తరగతుల్లో ఆయన మాట్లాడారు. వెదురు సాగుతో రైతులకు అధిక లాభాలు వస్తాయన్నారు. సులభ పద్ధతుల్లో వెదురు సాగు చేయడం, వెదురు వల్ల కలిగే లాభాలపై రెండు రోజుల పాటు ఇస్తున్న ట్రైనింగ్ సద్వినియోగం చేసుకోవాలన్నారు. మునగ, వెదురు సాగుతో రైతుల ఇంట సిరులు పంట పండినట్టే నన్నారు.
థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు వినియోగంతో ఎక్కువ కాలుష్యం ఏర్పడుతొందన్నారు. వెదురుతో తయారు చేసిన గుళికలు వినియోగించడం ద్వారా వాయు కాలుష్యం ఉండదన్నారు. చంద్రుగొండ, ములకలపల్లి, గుండాల మండలాల్లోని భూములు వెదురు సాగుకు అనుకూలంగా ఉన్నాయన్నారు. ఈ ప్రోగ్రాంలో అడిషనల్ కలెక్టర్ విద్యాచందన, హార్టికల్చర్ ఆఫీసర్ కిశోర్, ఫౌండేషన్ ప్రోగ్రాం మేనేజర్ రమ్య, డాక్టర్ శ్రీకాంత్, అమృత, అక్షయ్, కుసుమ కుమారి పాల్గొన్నారు.