Historical News: ఆ ఊళ్లో మనుషులే ఉండరట... ఎక్కడో కాదు.. తెలంగాణలోనే..

Historical News: ఆ ఊళ్లో మనుషులే ఉండరట... ఎక్కడో కాదు.. తెలంగాణలోనే..

ఊరన్నాక మనుషులు ఉండాలి కదా! మనుషులే ఉండని ఊరేమిటా అని ఆశ్చర్యపోతున్నారా? ఔను! ఆ ఊళ్లో మనుషులు ఉండరు. పాడుబడిన కట్టడాలే  ఉన్నాయి.  కొంత వ్యవసాయ భూమి ఉంటుంది.. ఇవి తప్ప అక్కడ నరమానవుల జాడ కనిపించదు. ఆ ఊరి పేరు కుబండ తిమ్మాపూర్​.  ఇది తెలంగాణలోని జోగులాంబ గద్వాల్ జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గంలోని అయిజ మండలంలో   ఉంది. కాని ఈ ఊరు కనుమరుగై  70 ఏళ్లు దాటినా .. ఇంకా రెవిన్యూ విలేజ్​ గా కొనసాగుతుంది.   . అక్కడ జనాలు ఎందుకు ఖాళీచేసారో తెలుసుకుందాం. . .

కొంతమంది కలిసి ఓ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటే దానిని ఓ ఊరుగా పరిగణిస్తారు. దానికి ఓపేరు పెడతారు.  ఊరంటే  ఏమున్నా లేకపోయినా... జనం మాత్రం కచ్చితంగా ఉండాలి. జనం లేకపోతే ఆ ప్రదేశాన్ని ఊరుగా పరిగణించలేంరు. కానీ.. అసలు మనుషులే లేకున్నా ఇక ప్రదేశానికి ఊరిగా పేరుంది .. అంతే కాదు ప్రభుత్వ లెక్కల్లో రెవెన్యూ విలేజీగా కూడా ఎక్కింది.  ఈ ఊరు కాని ఊరికి  గ్రామ రెవిన్యూ అధికారి వ్యవస్థ కొనసాగే సమయంలో.. వీఆర్వో కూడా ఉన్నాడు.  కాని అక్కడ మాత్రం జనాలు ఉండరు.   

జోగులాంబ గద్వాల్ జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గంలోని అయిజ మండలంలో ఉంది . బండ తిమ్మాపూర్ అనే  వింత  ఊరు కనుమరుగై 70 ఏళ్లు గడుస్తున్నా... దాని పేరు ఇప్పటికీ వినిపిస్తోంది. ఇక్కడ మనుషులు లేరు. ఇళ్లు లేవు. కానీ ఈ  ఊరికి పేరు మాత్రం ఉంది. ఇప్పుడు రెవెన్యూ విలేజ్ గా కూడా కొనసాగుతోంది. బండ తిమ్మాపూర్' విస్తీర్ణం 866ఎకరాలు అందులో 39 ఎకరాలు ఆయకట్టు, 627 ఎకరాల మెట్ట ఉంది. ఆ భూమినీ అయిజ, ఎక్లాస్​ పూర్ గ్రామాలకు చెందిన 477 మంది రైతులు సాగు చేస్తున్నట్లు రెవెన్యూ రికార్డుల్లో ఉంది. 

 బండ తిమ్మాపురం చరిత్ర

1830లో మొదటగా గోర్లకాపరి తిమ్మప్ప అనే వ్యక్తి ఈ ప్రాంతంలో ఉన్న బండమీద ఒక ఇల్లు కట్టుకున్నాడు. ఆ తర్వాత అన్ని కుల వృత్తుల వాళ్లు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అందుకే దీనికి 'బండ తిమ్మాపూర్" అనే పేరు వచ్చింది. బండ తిమ్మాపూర్​ లో సుమారు వంద. కుటుంబాలు  ఉండేవి. తర్వాత కొన్నాళ్లకు నిజాం గవర్నమెంట్ దీన్ని రెవెన్యూ విలేజ్ గా గుర్తించింది. ఈ ఊరికి ఆనుకుని ఉన్న వాగు నీటిని వాడుకుని కొంత భూమిని సాగు చేసేవాళ్లు.   ఆవాగు ఇప్పటికీ పారుతుంది. మిగతా భూమిలో వర్షాధార పంటలు సాగుచేసేవాళ్లు . 

ఆవాగు నీళ్లను వాడుకున్నందుకు రైతులు నిజాం గవర్నమెంట్ కు శిస్తు కట్టేవాళ్లు కానీ కొన్ని కారణాల వల్ల 1945 నుంచి ఆ గ్రామంలో.. ఎవరూ ఉండడంలేదు. అయినా.. ఇప్పటికీ రెవెన్యూ విలేజ్ గానే కొనసాగుతోంది. గతంలో ఇక్కడ శిథిలావస్థలో ఉన్న ఇళ్లు ఉండేవి. అప్పట్లో ఈ ప్రాంతాన్ని పాలించిన గద్వాల్ సంస్థానాదీశులైన సోమనాద్రీ పూర్వీకుల శిల్పాలు ఇప్పటికీ ఇక్కడున్నాయి.

ఎలా ఖాళీ అయిందంటే

బండ తిమ్మాపూర్ ప్రజలకు సరైన సౌకర్యాలు ఉండేవి కావు. ఏ చిన్న అవసరం వచ్చినా అయిజకు వెళ్లాల్సి వచ్చేది. ఎక్కడికి వెళ్లాలన్నా వాగు దాటి వెళ్లాలి. అందుకే చాలామంది బండ తిమ్మాపూర్ ఊరు  విడిచి వెళ్లిపోయారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో చెరువు తవ్విస్తామని నవాబులు చెప్పడంతో మిగిలిన వాళ్లు కూడా అయిజ,ఎక్లాస్ పూర్ గ్రామాలకు వలస వెళ్లిపోయారు. దాంతో తిమ్మాపూర్, పూర్తిగా ఖాళీ అయ్యింది.

మనుషులు లేకున్నా ఊరే

బండ తిమ్మాపూర్లో మనుషులు లేకున్నా రెవెన్యూ గ్రామంగానే కొనసాగిస్తున్నాం. గతంలో వీఆర్వోకూడా ఉన్నారు. ఆ భూములకు పన్నులు వసూలు చేస్తున్నాం. బి తిమ్మాపూర్ రైతులు అయిజ, ఎక్లాస్​ పూర్ గ్రామాల్లో ఉన్నారు.  దేవబండ దగ్గర్లో బండ తిమ్మాపూర్​ ఉండేదని పూర్వీకులు చెప్పేవారని కొంతమందిఅంటున్నారు.  ఆగ్రామ రైతులు గ్రామంలో  రోడ్డు పక్కకు గుళ్లు, విగ్రహాలు ఉన్నాయని అయిజ. ఎక్లాస్​ పూర్​ గ్రామస్తులు చెబుతున్నారు.   అయితే ఇప్పుడు పూర్వపు ఆనవాళ్లుగా ఒక రోలు  మాత్రమే ఉందని అంటున్నారు. బండాతిమ్మాపూర్​లో వ్యవసాయం చేసే వారు తెలిపిన వివరాల ప్రకారం.. తమ పూర్వీకులు ఆగ్రామంలో ఉండేవారని.. ఇప్పటికి తమకు ఆ ఊళ్లో భూమి ఉందంటున్నారు.  ఆ గ్రామ రైతులను  ఇప్పటికీ. బండమీద తిమ్మాపూర్ రైతులు అనే పిలుస్తారు.