పంజాగుట్ట పీఎస్ ఇన్​స్పెక్టర్ గా బండారి శోభన్

పంజాగుట్ట పీఎస్ ఇన్​స్పెక్టర్ గా బండారి శోభన్

పంజాగుట్ట, వెలుగు: పంజాగుట్ట పీఎస్ ఇన్ స్పెక్టర్ గా బండారి శోభన్ గురువారం బాధ్యతలు చేపట్టారు. బోధన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొడుకు సాహిల్​ కేసు విషయంలో.. విధుల్లో నిర్లక్ష్యం వహించిన అప్పటి పంజాగుట్ట ఇన్​స్పెక్టర్ దుర్గారావుపై సస్పెన్షన్ వేటు పడిన సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల జరిగిన బదిలీల్లో  భాగంగా పంజాగుట్ట పీఎస్​కు ఇన్ స్పెక్టర్ గా నియామకమైన బండారి శోభన్ గురువారం బాధ్యతలు చేపట్టారు.

2007 బ్యాచ్​కు చెందిన శోభన్ 2014 వరకు సైబరాబాద్ కమిషరేట్​లో విధులు నిర్వహించారు. ఆ తర్వాత నిజామాబాద్​కు బదిలీపై వెళ్లారు.  2020లో 317 జీవో  కారణంగా తిరిగి హైదరాబాద్​కు బదిలీపై వచ్చారు.2022 నుంచి 2023 వరకు ఏడాది పాటు యూఎన్ పీస్ మిషన్​లో భాగంగా ఆఫ్రికాలో విధులు నిర్వహించారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత సిటీ కమిషరేట్​లో పనిచేస్తున్న శోభన్..  పంజాగుట్ట పీఎస్​కు ఇన్​స్పెక్టర్​గా బదిలీపై వచ్చారు. గురువారం   బాధ్యతలు చేపట్టారు.