
రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అని కరీంనగర్ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఆయన ఆగస్టు 23న బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ పోలింగ్బూత్మేళ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని.. త్వరలోనే ప్రజలు వారికి బుద్ధి చెబుతారని విమర్శించారు. పార్టీ శ్రేణులు ఎన్నికలకు సమాయత్తం కావాలని సూచించారు.
అనంతరం చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, సర్దార్పాపన్న విగ్రహాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. బూత్మేళలో భాగంగా చేవెళ్ల కూడలి నుంచి సీహెచ్ఆర్గార్డెన్స్వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్లీడర్లు కొండా విశ్వేశ్వరరెడ్డి, జితేందర్రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.