దేశ ఆర్థికాభివృద్ధిలో ఎన్నారైలది కీ రోల్ : బండి సంజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

దేశ ఆర్థికాభివృద్ధిలో ఎన్నారైలది కీ రోల్ :  బండి సంజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

ముషీరాబాద్, వెలుగు :  దేశ ఆర్థికాభివృద్ధిలో ఎన్నారైల పాత్ర కీలకమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఎన్నారైలు విదేశాల్లో ఉంటున్నప్పటికీ మన దేశంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని కొనియాడారు. ఆదివారం రాత్రి  లోయర్ ట్యాంక్​బండ్​లోని మారియట్ హోటల్​లో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్లోబల్ ఎన్నారై మీట్ కార్యక్రమం జరిగింది.

బండి సంజయ్​తో పాటు​ ఎమ్మెల్యేలు పైడి రాకేశ్ రెడ్డి, యశస్విని రెడ్డి, కాటేపల్లి వెంకటరమణారెడ్డి  హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ..  రాష్ట్రానికి చెందిన ఎంతో మంది వివిధ దేశాల్లో స్థిరపడ్డారన్నారు. ఆర్థికంగా సంపాదించి  దేశంలో సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు ఆర్థికాభివృద్ధికి సహకరిస్తున్నారన్నారు.