
తెలంగాణలో కులం, మంతం మీద చర్చ జరుగుతుండటం దురదృష్టకరమని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో స్వదేశీ జాగరణ మంచ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వదేశీ మేళా ముగింపు వేడుకల్లో పాల్గొ్న్నారు ఆయన. ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు:
రాష్ట్రంలో కులగణన చేసి10 శాతం ముస్లింలను బీసీలుగా మార్చారు..
బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ 32 శాతమే.. 42 శాతం ఎలా అవుతుంది ?
లవ్ జిహాదీ, మత మార్పిడిలకు వ్యతిరేకంగా మహారాష్ట్ర తరహాలో తెలంగాణలోనూ చట్టం రావాలి
హిందూ బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తే కేంద్రం సహకరిస్తుంది
మమ్మల్ని మతతత్వ వాదులు అన్నా పర్వాలేదు.
ప్రధాని మోడీ కులాన్ని 994లో బీసీగా మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే
నరేంద్ర మోడీ పక్కా ఇండియన్
రాహుల్ తాత ఫిరోజ్ ఖాన్ గాంధీ..
రాజీవ్ గాంధీ తండ్రి ముస్లిం అయితే రాహుల్ గాంధీ కూడా ముస్లిం అవుతారు
రాహుల్ మాత్రం తను బ్రాహ్మిణ్ అంటున్నారు
రాహుల్ తల్లి సోనియా క్రిస్టియన్.
తండ్రి కులమే కొడుకుకు వస్తుందంటున్న కాంగ్రెస్ వాళ్లు సమాధానం చెప్పాలి
ALSO READ | సోమవారం(ఫిబ్రవరి 17) హైదరాబాద్లో పలు చోట్ల నల్లా నీళ్లు బంద్