
న్యూఢిల్లీ: పహల్గాం దాడిని ప్రపంచం మొత్తం ఖండిస్తుంటే.. పొరుగుదేశం బంగ్లాదేశ్మాత్రం భారత వ్యతిరేక వైఖరిని కనబరుస్తోంది. జమ్మూకాశ్మీర్లోని బైసరన్లో ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన మరుసటిరోజే స్థానిక లష్కరే తోయిబా (ఎల్ఈటీ) మిలిటెంట్ ఇజార్తో బంగ్లా లీగల్ అడ్వైజర్ డాక్టర్ ఆసిఫ్ నజ్రుల్ భేటీ అయ్యారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా వేదికగా ఈ సమావేశం జరిగినట్టు పలు కథనాలు వెలువడ్డాయి.
బంగ్లా గడ్డ నుంచి ఉగ్రదాడులకు పాల్పడిన చరిత్ర ఇజార్కు ఉంది. పహల్గాందాడికి పాల్పడింది ఎల్ఈటీ అనుబంధ సంస్థ ‘ది రెసిస్టన్స్ ఫ్రంట్’ (టీఆర్ఎఫ్) అని ఇండియన్ ఇంటెలిజెన్స్ఏజెన్సీలు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిరువురి భేటీ ఉగ్రవాదం విషయంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ విధానంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.