బ్యాంక్ ఎంప్లాయ్ ఆఫీసులోనే ఆత్మహత్య

బ్యాంక్ ఎంప్లాయ్ ఆఫీసులోనే ఆత్మహత్య

హైదరాబాద్ : నాంపల్లిలోని హైదరాబాద్ జిల్లా కో- ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. బ్యాంక్ లోనే ఎంప్లాయ్ సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. బ్యాంక్ 3వ అంతస్థులో చైర్మన్ బాత్ రూంలోని కిటికీకి ఉరేసుకొని ఓంకార్ శేఖర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

సైదాబాద్ కు చెందిన ఓంకార్ శేఖర్ గ్రూప్ 4 ఉద్యోగి. బ్యాంక్ లో తోటి ఉద్యోగల్లో ఈ ఘటన విషాదాన్ని నింపింది. సమాచారం అందుకొని అబిడ్స్ పోలీసులు  అక్కడికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.  ఓంకార్ శేఖర్ సూసైడ్ కి గల కారణాలేంటి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.