బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఎఫ్​డీలపై 8.10శాతం వడ్డీ

బ్యాంక్ ఆఫ్ ఇండియా  కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఎఫ్​డీలపై 8.10శాతం వడ్డీ

హైదరాబాద్​, వెలుగు : బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ) తన కస్టమర్లకు పండుగ సీజన్ బహుమతిగా రూ.మూడు కోట్ల కంటే తక్కువ ఉన్న ప్రత్యేక 400 రోజుల రిటైల్ టర్మ్ డిపాజిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌ను ప్రవేశ పెట్టింది. ఇందులో ఇన్వెస్ట్​ చేస్తే భారీ వడ్డీ పొందవచ్చని తెలిపింది. సూపర్ సీనియర్ సిటిజన్లు 8.10 శాతం, సీనియర్ సిటిజన్ కోసం 7.95శాతం, ఇతర కస్టమర్లకు 7.45శాతం వడ్డీ ఇస్తారు. ఇందులో ప్రిమెచ్యూర్​ విత్​డ్రాయల్​సదుపాయం ఉంటుంది. ఎన్​ఆర్​ఈ, ఎన్​ఆర్​ డిపాజిటర్లూ ఈ స్కీములో ఇన్వెస్ట్​ చేయొచ్చు.