
కోల్కతా: తమ ముఖ్యమైన డిమాండ్ల గురించి ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్(ఐబీఏ)తో జరిగిన చర్చలు విఫలమవడంతో, ఈ నెల 24,25 తేదీల్లో సమ్మె చేయనున్నట్టు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్బీయూ) తాజాగా ప్రకటించింది. వారానికి ఐదు రోజుల పని, కొత్త రిక్రూట్మెంట్ప్రారంభించడం వంటి అంశాలపై ఐబీఐ దగ్గర ప్రస్తావించామని, ఫలితం కనిపించలేదని నేషనల్ కాన్ఫిడరేషన్ఆఫ్బ్యాంక్ ఎంప్లాయీస్(ఎన్సీబీఈ) జనరల్సెక్రటరీ చంద్రశేఖర్అన్నారు.
తొమ్మిది బ్యాంకు ఉద్యోగుల సంఘాలతో ఏర్పాటైన యూఎఫ్బీయూ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీ గురించి ఎప్పటి నుంచో మాట్లాడుతున్నదని చెప్పారు. ఉద్యోగులకు పెర్ఫార్మెన్స్ రివ్యూలు, పెర్ఫార్మెన్స్ఇన్సెంటివ్స్ను ఇవ్వడాన్ని నిలిపివేయాలని డిమాండ్చేశారు. ఇలాంటి చర్యల వల్ల ఉద్యోగ భద్రత ఉండదని చంద్రశేఖర్ ఆందోళన వ్యక్తం చేశారు. యూఎఫ్బీయూలో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ , ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ , నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ వంటి ప్రధాన బ్యాంకు యూనియన్లు ఉన్నాయి.